సంక్రాంతికి తెలుగులో రెండు భారీ చిత్రాలు రిలీజ్‌ అయినట్టే, తమిళంలో కూడా రెండు పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. తమిళ సూపర్‌స్టార్స్‌ అజిత్‌, విజయ్‌ ఇద్దరూ సంక్రాంతికి తలపడ్డారు. ఇద్దరూ మాస్‌ సినిమాలే చేయడంతో ఆ చిత్రాల మధ్య పోటీ రసవత్తరంగా సాగింది.
ఫైనల్‌గా ఆ రెండూ కూడా 35 కోట్ల షేర్‌తో సరిపెట్టుకున్నాయి. ఇక మహేష్‌ ’1 నేనొక్కడినే’ అయితే 29 కోట్ల షేర్‌తో సంక్రాంతి సినిమాల్లో లాస్ట్‌ ప్లేస్‌ తీసుకుంది. ఈ ముగ్గురు సూపర్‌స్టార్స్‌ కంటే రామ్‌ చరణ్‌ సినిమా ‘ఎవడు’ ఎక్కువ వసూలు చేసి సంక్రాంతికి అతడినే విన్నర్‌గా నిలబెట్టింది. 47 కోట్లకి పైగా షేర్‌తో ఎవడు చరణ్‌ సినిమాల్లో ఆల్‌ టైమ్‌ టాప్‌ 2 హిట్‌గా నిలిచింది.
భయ్యా పేరిట మలయాళంలోకి అనువాదమైన ఎవడుకి అక్కడ కూడా ఆదరణ బాగుంది. అల్లు అర్జున్‌, చరణ్‌ ఇద్దరికీ కేరళలో మంచి గుర్తింపు ఉండడంతో ఈ చిత్రానికి అక్కడ మాస్‌ ప్రేక్షకుల ఆదరణ దక్కుతోంది. కమర్షియల్‌గా భయ్యా మంచి రేంజ్‌కి చేరుకుందని, అక్కడ రిలీజ్‌ చేసిన నిర్మాతకి లాభం బాగా వచ్చిందని ట్రేడ్‌ రిపోర్ట్స్‌ వస్తున్నాయి.

Post a Comment

 
Top