భోజ్‌పురి నటుడు సత్యేంద్ర పోలీసుకు ఇచ్చిన ఫిర్యాదులో సంచలన వ్యాఖ్యలు చేసారు. బాలీవుడ్ హీరోయిన్ డైసీ షా, ఆమె మెంటర్ గణేష్ ఆచార్య, దర్శకుడు వికె సింగ్, మరో 18 మంది కలిసి తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఎఐఆర్‌లో పేర్కొన్నారు. సత్యేంద్ర వీరందరితో కలిసి ‘సోడా’ అనే బాలీవుడ్ చిత్రానికి పని చేసినట్లు సమాచారం. ‘రాష్టవాది సమాజ్‌వాది పార్టీ’ అనే పేరుగల రద్దయిన రాజకీయ పార్టీకి ప్రెడిడెంట్‌గా ఉన్న సత్యేంద్ర ఉత్తరప్రదేశ్‌లో మెయిన్‌పురి జిల్లాలో ఈ ఫిర్యాదు చేసారు. ఎఫ్ఐఆర్‌లో ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ ‘నేను సోడా అనే హిందీ చిత్రంలో నటిస్తున్నాను. నాతో పాటు డైసీ షా మెయిన్ లీడ్ రోల్ చేస్తోంది. గణేష్ ఓ పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నాడు. దీని కోసం నేను స్క్రిప్టు కూడా రాసాను. ఏమైందో తెలియదు, కమాలిస్తాన్ స్టూడియోలో రెండు రోజుల షూటింగ్ పూర్తయిన తర్వాత అందరూ కలిసి నన్ను ఈ ప్రాజెక్టు నుండి తప్పించాలనే ప్రయత్నం మొదలు పెట్టారు. పాపులర్ స్టార్‌తో పని చేయాలనే ప్లాన్‌తో డైషా షా నన్ను ఈ సినిమా నుండి తప్పించాలని పథకం వేసింది’ అని పేర్కొన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే…. సత్యేంద్ర చెబుతున్న ఆ పాపులర్ స్టార్ ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్. ఇటీవల డైసీ షా సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘జై హో’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. తన శత్రవులు ఇప్పటికే ఒకసారి తనను చంపడానికి ప్రయత్నించారని సత్యేంద్ర వెల్లడించారు. గతంలో తనకు ఎదురైన ఓ సంఘటన గురించిన చెబుతూ ‘నాకు డిసెంబర్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. మొదట అది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ అనుకున్నాను. కానీ కావాలనే ఓ వ్యక్తి నా కారును ఓవర్ టేక్ చేస్తూ యాక్సిడెంట్ అయ్యేలా చేసాడు. ఇదంతా సోడా మూవీలో నాతో పాటు పని చేసిన వారి పనే’ అని వెల్లడించారు. సత్యేంద్ర ఫిర్యాదు గురించి నేషనల్ మీడియా గణేష్ ఆచార్యను ప్రశ్నించగా….‘ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదని, ఆ కంప్లయింట్ కూడా నా దృష్టికి రాలేదని’ తెలిపారు. ఈ వివాదంపై డైసీ షా స్పందిస్తూ…‘దాదాపు 16 నెలల క్రితం ఆ సాంగు చిత్రీకరణ జరిగింది. కానీ ఇపుడు ఆ చిత్రంలో నేను పని చేయడం లేదు’ అని తెలిపింది.

Post a Comment

 
Top